
బలంగా బౌలింగ్
'తొలి మ్యాచ్లో శ్రీలంక, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి జోరు మీదున్న అఫ్గానిస్థాన్ను నిలువరించడం భారత్, పాకిస్థాన్ లాంటి మేటి జట్లకు కూడా బిగ్ చాలెంజ్. అఫ్గాన్ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగంతో జాగ్రత్తగా ఉండాలి. శ్రీలంకతో మ్యాచ్లో యువ పేసర్ ఫజల్ హాక్ ఫరూఖీ (3/11), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/24), మహమ్మద్ నబీ (2/14) సత్తా చాటితే.. బంగ్లాతో మ్యాచ్లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) చెలరేగిన విషయం తెలిసిందే.

డేంజరస్ బ్యాటింగ్
అలాగే బ్యాటింగ్లోనూ అఫ్గాన్ను చిన్నచూపు చూడకూడదు. బంగ్లాపై ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జడ్రాన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు), నజీబుల్లా జడ్రాన్ (17 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) ఏ రకంగా చెలరేగారో భారత్, పాక్ జట్లు గమనించాలి. తమ ఆటతో ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. 'అని అజయ్ జడేజా పేర్కొన్నాడు. అయితే బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల బ్యాటింగ్, బౌలింగ్ బలహీనంగా ఉండటంతో అఫ్గాన్ చెలరేగిందని, భారత్తో గెలిచే సత్తా ఆ జట్టుకు లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

భారత్ గెలిస్తే..
గ్రూప్ బీ నుంచి రెండో స్థానం కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటిపడుతున్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. పాక్పై తొలి మ్యాచ్లో విజయంతో టీమిండియా సూపర్-4 తొలి బెర్తును (గ్రూప్-ఏ) దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం పాకిస్తాన్, హాంగ్కాంగ్ జట్లు పోటీపడుతున్నాయి. ఇవాళహాంగ్కాంగ్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే టాప్ ప్లేస్ ఖాయమవడమే కాకుండా సూపర్ -4 బెర్త్ ఖారారు చేసుకుంటుంది. ఆ తర్వాత సూపర్ -4లో అఫ్గాన్తో భారత్ తలపడుతుంది.


Click it and Unblock the Notifications












