హైదరాబాద్: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న డ్వేన్ బ్రావో... తాను మంచి స్నేహితులం మాత్రమేనని బాలీవుడ్ హీరోయిన్ నటాషా సూరి వెల్లడించింది. ఇటీవల కాలంలో డ్వేన్ బ్రావో, మాజీ మిస్ ఇండియా నటాషా సూరి ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలసిందే.
దీంతో బ్రావో, తనకు మధ్య ఉన్న రిలేషన్పై నటాషా స్పందించారు. 'ఇక నుంచి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టండి. బ్రావో, నేను డేటింగ్ చేయడం లేదు. నా దృష్టంతా నా కెరీర్ మీదే ఉంది. బ్రేవో గ్రేట్ క్రికెటర్ కాదు మంచి గాయకుడు కూడా. అందుకు అతడ్ని నేను ఇష్టపడుతున్నాను. బ్రేవో, నేను మంచి స్నేహితులం' అని ఆమె పేర్కొంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'ఇద్దరి మధ్య సంభాషణ, అన్యోన్యత సమయంలో దిగిన ఫొటోలు షేర్ చేశామంటే.. వాళ్లు రొమాన్స్ చేస్తున్నారని భావించవద్దు. ఆడ, మగ కలిసి ఉన్న ఫొటోలు చూపిస్తూ ఏదో కథలు అల్లడం ఆపివేయడం మంచిది. మళ్లీ చెబుతున్నాను. నేను, బ్రావో స్నేహితులం మాత్రమే. ధన్యవాదాలు' అంటూ నటాషా ఇనిస్టాగ్రామ్లో ఫోటోని అభిమానులతో పంచుకుంది.
A post shared by Natasha Suri (@natashasuri) on
ఈ సీజన్లో భాగంగా జరిగిన ఆరంభ మ్యాచ్లో చెన్నై-ముంబై జట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు హాజరైన హీరోయిన్ నటాషా సూరి వీఐపీ గ్యాలరీలో కూర్చుని చెన్నైకి మద్దతు తెలపడంతో ఓడిపోతుందనుకున్న చెన్నై జట్టుని బ్రావో కీలక ఇన్నింగ్స్ ఆడి విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్కు ముందు వీరిద్దరూ ముంబై హోటల్లో కలిసి దిగిన ఫొటోలను నటాషా తన ఇన్స్ట్రాగ్రామ్లో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.