25 సిక్సర్లు, 15 ఫోర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత!
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దేశీయ క్రికెట్లో విధ్వంసం సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అభిషేక్ శర్మ బ్యాట్తో విరుచుకుపడి బౌలర్లను కేవలం ప్రేక్షకులుగా మార్చేశాడు. ఇటీవల టీమిండియా తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా స్కోర్లు చేయలేకపోయిన అభిషేక్ శర్మ.. దేశీయ క్రికెట్లో తన పాత ఫామ్ను ప్రదర్శించాడు. 2026-27 పంజాబ్ రాష్ట్ర అంతర్-జిల్లా సీనియర్ వన్డే పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో అమృత్సర్ సీనియర్ జట్టు తరఫున ఆడిన అభిషేక్ శర్మ , కేవలం 91 బంతుల్లో 233 పరుగులు చేసి తార్న్ తారన్ జట్టుపై సీనియర్ బౌలర్లను చితకబాదాడు. ఈ మ్యాచ్ నేడు(ఆగస్టు 2)అమృత్సర్లోని గాంధీ గ్రౌండ్స్లో జరిగింది.
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అత్యంత విధ్వంసకరంగా సాగింది. అభిషేక్ తన 233 పరుగుల ఇన్నింగ్స్లో 25 సిక్సర్లు, 15 ఫోర్లు బాదాడు. అంటే కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 210 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అభిషేక్ స్ట్రైక్ రేట్ 256.04గా ఉంది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి, ప్రత్యర్థి బౌలర్లెవరినీ ఫామ్లోకి రానివ్వలేదు. అభిషేక్ శర్మ ముందు తార్న్ తారన్ బౌలర్లు పూర్తిగా నిస్సహాయులయ్యారు. ఫాస్ట్ బౌలర్లైనా, స్పిన్నర్లైనా సరే అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో వీరవిహారం చేశాడు. అభిషేక్ శర్మ మైదానం నలువైపులా కొట్టిన భారీ సిక్సర్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

533 పరుగులు చేసిన అమృత్ సర్ జట్టు
అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ పుణ్యమా అని, అమృత్సర్ సీనియర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోరును సాధించింది. అభిషేక్ శర్మతో పాటు ఓపెనర్ అభయ్ చౌదరి 85 బంతుల్లో 93 పరుగులు, అభినవ్ శర్మ 33 బంతుల్లో 51 పరుగులు, సాహిల్ శర్మ 20 బంతుల్లో 37 పరుగులు చేశారు. వరీందర్ సింగ్ లోహ్త్ 36 పరుగులతో కీలక సహకారం అందించగా.. సలీల్ అరోరా 29 పరుగులు చేశాడు.
జింబాబ్వేతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్లో రాణించలేకపోయాడు. అభిషేక్ శర్మ మూడు ఇన్నింగ్స్లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అభిషేక్ పేలవ ఫామ్ భారత జట్టుపై ప్రభావం చూపలేదు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ఆ సిరీస్ను 3-0తో గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

