
పోయేది భారత క్రికెట్ పరువే..
ఈ వివాదంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. ఈ తరహా వివాదాలతో భారత క్రికెట్కు నష్టం కలుగుతుందన్నాడు. 'ఇక్కడ ఎవరు నిజం చెబుతున్నారు? మరెవరు అబద్దం చెబుతున్నారన్నది ప్రశ్నకాదు. అసలేందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయనేదే ప్రశ్న. ఎందుకుంటే ఈ తరహా వివాదాలతో నష్టపోయేది నువ్వో? నేనో.. ఇంకెవరో కాదు. భారత క్రికెట్కే తీరని నష్టం జరుగుతుంది.

నిజం కన్నా ఊహ బలమైది...
'నిజం కన్నా ఊహ' బలంగా ఉంటుందనే లైన్ చదివి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు జరుగుతుందంతా చూస్తే అది నిజమే అనిపిస్తోంది. సౌతాఫ్రికా పర్యటనలో తాను సెలవే కోరలేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. కానీ రోహిత్ శర్మను కెప్టెన్ చేయగానే విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగినట్లు అనిపిస్తోంది. అయితే ఈ పుకార్లు పుట్టిస్తుంది ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది అర్థం కావడం లేదు.

కోహ్లీతో చర్చించాల్సింది..
టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడే వన్డే, టెస్ట్ల్లో కెప్టెన్గా కొనసాగుతానని విరాట్ కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు తెలిపాడు. అయితే కెప్టెన్సీ అనేది హక్కు కాదు అదొక గౌరవం. దాన్ని హక్కుగా భావిస్తే గౌరవం దక్కదు. అయితే దేశానికి ఎన్నో విజయాలందించిన వంటి విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే ముందు అతనితో చర్చించాల్సింది. కేవలం సమాచారం ఇచ్చి ఇలా చేయడం బాలేదు'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

కపిల్, గవాస్కర్ సైతం..
ఈ వివాదంపై భారత దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపీల్ దేవ్లు సైతం స్పందించారు. కోహ్లీ-గంగూలీ వివాదంలో.. భారత టెస్ట్ కెప్టెన్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీసీసీఐ మీదికంటే ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపైనే ఎక్కువగా ఉందని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇక కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఎంత పెద్ద క్రికెటర్ అయినా కెప్టెన్ విషయంలో నిర్ణయం తీసుకునేది సెలెక్టర్లేనని చెప్పాడు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించి సౌతాఫ్రికా పర్యటన మీద ఫోకస్ పెట్టాలని విరాట్ కోహ్లీకి చురకలంటించాడు.


Click it and Unblock the Notifications
