హార్దిక్ లేని లోటును..
'బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ను పోల్చడం సరికాదు. బ్యాటింగ్ పరంగా చూస్తే పాండ్యా చాలా ముందున్నాడు. పాండ్యా భారీ పరుగులు చేయగలడు. ఇక బౌలింగ్లో హార్దిక్ కన్నా శార్దూల్ ఠాకూర్ మెరుగ్గా కనిపిస్తున్నాడు. మ్యాచ్లో కీలక వికెట్లు పడగొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అత్యద్భుతం. ఏడు వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్లో 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
శార్దూల్ చేసిన పరుగులు..
అయితే, శార్దూల్ చేసిన పరుగులు ఎంత విలువైనవో ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ, తరువాత వాటి విలువ తెలుస్తుంది. ఎందుకంటే సౌతాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులే కావాలి. ఒకవేళ శార్దూల్ ఠాకూర్ ఆ పరుగులు చేయకపోయుంటే ఆతిథ్య జట్టు లక్ష్యం మరింత తక్కువగా ఉండేది. విహారితో కలిసి ఏడో వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పకపోయి ఉంటే టీమిండియా ఈపాటికే ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచేది'' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఊరిస్తున్న విజయం..
ఈ మ్యాచ్లో భారత్ జట్టు సౌతాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని అందుకునే ప్రయత్నంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (121 బంతుల్లో 2 ఫోర్లతో 46 బ్యాటింగ్), డసెన్ (11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58), చతేశ్వర్ పుజారా (86 బంతుల్లో10 ఫోర్లతో 53) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 50, రవిచంద్రన్ అశ్విన్ 46, మార్కో జాన్సెన్ 4/31)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్( కీగన్ పీటర్సన్ 62, శార్దూల్ ఠాకూర్ 7/61)
భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్( రహానే 58, పుజారా 53, లుంగి ఎంగిడి 3/43)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 118/2(డీన్ ఎల్గర్(46 బ్యాటింగ్))