
మొదటి జట్టు భారత్
తాజాగా పాకిస్థాన్ బ్రాడ్కాస్టర్ సవేరా పాషాతో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'డీఆర్ఎస్ను ఉపయోగించుకున్న మొదటి జట్టు భారత్. 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా అది జరిగింది. అప్పుడు ఎంఎస్ ధోనీ సారథి కాదు.. అనిల్ కుంబ్లే కెప్టెన్గా ఉన్నాడు. ఆ సిరీస్లో భారత్ కొన్ని తప్పుడు సమీక్షలు తీసుకుంది. అప్పట్లో అది కొత్త సాంకేతిక పద్ధతి కావడంతో భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు తప్పుడు ఫలితాలు వచ్చాయి. అప్పుడే టీంఇండియాకు నచ్చలేదని నిర్ణయం తీసుకుంది' అని అన్నాడు.

ధోనీకి కూడా నచ్చలేదు
'డీఆర్ఎస్ పద్ధతిని భారత్ వ్యతిరేకించింది. మరోవైపు ఆ సాంకేతిక ఎంఎస్ ధోనీకి కూడా నచ్చలేదు. అయితే కెప్టెన్ అభిప్రాయానికే విలువ ఉంటుంది. అది సాంకేతిక పరమైన విషయమైనా పూర్తిస్థాయిలో సరైన ఫలితం ఇవ్వదని చాలాకాలం తర్వాత ధోనీ నమ్మాడు. మరోవైపు ఇప్పటికీ అంపైరింగ్ నిర్ణయాల్లో వివాదాలున్నాయి. డీఆర్ఎస్పైనా అనుమానాలున్నాయి. కానీ ఇప్పటి కన్నా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

డీఆర్ఎస్కు కోహ్లీ వీరాభిమాని:
ఎంఎస్ ధోనీకి డీఆర్ఎస్ సాంకేతికత నచ్చకపోవడంతో టీమిండియా కూడా దాన్ని వ్యతిరేకించేది అని టీమిండియా మాజీ క్రికెటర్ చెప్పాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ డీఆర్ఎస్కు వీరాభిమాని అని, ప్రతీ మ్యాచ్లో దాన్ని అమలు చేయాలని కోరుకుంటాడని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. ఐపీఎల్ అయినా, రంజీ అయినా కోహ్లీ డీఆర్ఎస్ పద్ధతికి ఒప్పుకుంటాడన్నాడు. సాంకేతిక అంశాల పరంగా ఇప్పుడు అందరి ఆలోచనలు మారాయని, దాన్ని అలాగే కొనసాగిస్తూ మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాశ్ చోప్రా అకాంక్షించాడు.

ధోనీకి డీఆర్ఎస్ నచ్చకపోయినా:
ఎంఎస్ ధోనీకి డీఆర్ఎస్ సాంకేతిక నచ్చకపోయినా, తాను మాత్రం దాన్ని 'ధోనీ రివ్యూ సిస్టమ్'గా పిలుస్తానని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఎందుకంటే.. అతడు తీసుకునే సమీక్షల్లో 10లో 9 సార్లు సరైన ఫలితాలొస్తాయని ఆయన గుర్తుచేశాడు. ఒకవేళ ధోనీ అంచనా తప్పని మనకు అనిపించినా.. ఫలితం మాత్రం అతడికి అనుకూలంగానే వస్తుందని ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
'కెప్టెన్సీలో మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే.. రెడీమేడ్ కెప్టెన్గా రోహిత్ రెడీ'


Click it and Unblock the Notifications












