
డేంజర్ జోన్లో రోహిత్ సేన..
ప్రస్తుతం 52.08 విజయాల శాతంతో భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా(75 శాతం), ఆస్ట్రేలియా(70 శాతం), శ్రీలంక(53.33 శాతం) భారత్ కన్నా ముందున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో భారత్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ను 4-0తో క్లీన్ స్వీప్ చేస్తే రోహిత్ సేనకు అవకాశం ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురించి మాట్లాడిన చోప్రా భారత అవకాశాలను వెల్లడించాడు.

4-0తో గెలవాలి..
'ఆస్ట్రేలియా.. భారత్తో నాలుగు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ను భారత్ 4-0తో గెలవాలి. అప్పుడే పాయింట్స్ టేబుల్లో మెరుగవుతారు. లేకుంటే ప్రమాదంలో పడతారు. ఇక ఆస్ట్రేలియా సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్లో ఆడుతుంది. ఈ సిరీస్లో ఆసీస్ విజయం సాధిస్తుంది. సౌతాఫ్రికాతో మూడు టెస్ట్ల సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది.

6 మ్యాచ్లు గెలిచినా..
ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇచ్చే టెస్ట్ సిరీస్ను టీమిండియా 4-0తో క్లీన్ స్వీప్ చేయాలి. బంగ్లాదేశ్ గడ్డపై కూడా భారత్ రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ 6 మ్యాచ్లకు 6 గెలవడం కష్టమే. కానీ ఇది తప్పా భారత్కు మరో ఆప్షన్ లేదు. ఇవన్నీ గెలిచినా భారత్ 68 శాతం విజయాలనే నమోదు చేస్తుంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

చేజారిన సువర్ణవకాశాం
6 మ్యాచ్లకు 6 గెలిచినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు ఫైనల్ చేరేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం భారత అవకాశాలను దెబ్బతీ సింది. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్.. తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. న్యూజిలాండ్ జరిగిన ఫైనల్లో పేలవ బ్యాటింగ్తో ఓటమిపాలై విశ్వవిజేతగా నిలిచే సువర్ణవకాశాన్ని కోహ్లీ సారథ్యంలోని భారత్ కోల్పోయింది.


Click it and Unblock the Notifications












