
రాహుల్కు పక్కా చాన్స్
భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో పటిష్టంగా ఉన్న బ్యాటింగ్లో మాత్రం బలహీనంగా ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఈ బలహీనతను అధిగమించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి తీసుకొని, మిడిలార్డర్లో ఆడించే అవకాశం ఉందని తెలిపాడు.
ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం కేఎల్ రాహుల్కు ఉంది. అతనికి ఇక్కడ ఓ సెంచరీ కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన వామప్ మ్యాచ్లో రాహుల్ శతకంతో మెరిసాడు. కాబట్టి అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం.

రోహిత్ జోడీపై నమ్మకం లేదు..
రాహుల్ను మిడిలార్డర్ లేదా, ఓపెనర్గా ఆడించవచ్చు. ఈ కారణంతోనే సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారు. భారత బ్యాటింగ్ కూడా బలహీనంగా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ ఫామ్లో లేడు. ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ విదేశాల్లో తమ సత్తాను నిరూపించుకోలేదు. హనుమ విహారి నిలకడగా రాణిస్తాడని చెప్పలేం. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ నేపథ్యంలోనే రాహుల్కు చోటు దక్కుతుందని చెబుతున్నా. ఓపెనర్గా, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే చాన్సుంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

నో సిరాజ్..
ఇక బౌలింగ్ విభాగంలో మరోసారి సీనియర్లకే అవకాశం దక్కనుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైనప్పటికీ.. మళ్లీ వారికి చాన్స్ ఇస్తారన్నాడు. మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్లకు మరోసారి నిరాశతప్పదన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మమమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతోనే పేస్ విభాగం ఉంటుందని, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు ఉంటున్నారన్నాడు. అక్షర్ పటేల్కు కూడా నిరీక్షణ తప్పదన్నాడు.


Click it and Unblock the Notifications












