
విహారి, పంత్ సెంచరీలు..
హనుమ విహారి( 194 బంతుల్లో 13 ఫోర్లు 104), రిషభ్ పంత్( 73 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 103) శతకాలతో మెరవగా, మయాంక్ అగర్వాల్(120బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 61), శుభ్మన్గిల్ (78 బంతుల్లో 10 ఫోర్లతో 65) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్ 386/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించిన ఆకాశ్చోప్రా.. బ్యాట్స్మెన్ అంతా రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు.

టచ్లోకి మయాంక్
తొలుత మయాంక్ అగర్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. అతను ఆస్ట్రేలియాలోనే కెరీర్ ఆరంభించాడని, కీలక సమయంలో పరుగులు చేసినందుకు అభినందించాలన్నాడు. ‘హాఫ్ సెంచరీతో మయాంక్ ఫామ్ అందుకున్నాడు. ఇంకా పరుగుల దాహంతో ఉన్నాడు. ఇప్పుడు శతకం బాదకపోయినా ఫర్వాలేదు. కానీటెస్టు మ్యాచ్ల్లో పెద్ద స్కోర్లు సాధించాలి'అని చోప్రా ఆకాంక్షించాడు.

పంత్ ఆట సూపర్.
ఇక రిషభ్పంత్ బ్యాటింగ్పై స్పందిస్తూ.. ఆట చివర్లో అతను అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా మెరుపు శతకం బాదాడన్నాడు.‘పంత్ క్రీజులోకి వచ్చేసరికే హనుమ విహారి చాలా ముందున్నాడు. అలాంటిది మ్యాచ్ పూర్తయ్యే సమయానికి ఇద్దరూ శతకాలు సాధించారు. ఈ ఆటలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా తాను మొదట విహారిని అనుకున్నాను. అయితే.. పంత్ తన ఆటతో ఆ అభిప్రాయాన్ని మార్చాడు. అతని ఆట ఆసీస్ గొప్ప వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ను తలపించింది. ఒక్క సెషన్లో పంత్ ఆట స్వరూపాన్ని మార్చేస్తాడు'అని చోప్రా అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications
