
వరుసగా మూడు టైటిళ్లు..
చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు టైటిళ్లు గెలిచింది. ఇందులో రెండు ఐపీఎల్ ట్రోఫీలు ఉండగా మరొకటి చాంపియన్స్ లీగ్ టైటిల్ ఉంది. 2008 అరంగేట్ర సీజన్లో రన్నరప్గా నిలిచిన చెన్నై.. విదేశాల్లో జరిగిన 2009 సీజన్లో సెమీస్కే పరిమితమైంది. ఇక భారత్ వేదికగా జరిగిన 2010 సీజన్లో దుమ్మురేపిన ధోనీ సేన.. చాంపియన్గా నిలిచింది. ఇక అదే ఏడాది వరల్డ్ బెస్ట్ టీ20 టీమ్స్ మధ్య జరిగిన చాంపియన్స్ లీగ్ టీ20లోనూ సత్తాచాటి మరో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఇక 2011 ఐపీఎల్ సీజన్లోనూ చెన్నై చాంపియన్గా నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ 2013లో ఐపీఎల్ టైటిల్తో పాటు చాంపియన్స్ లీగ్ ట్రోఫీ గెలిచినప్పటికీ 2014లో టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. సీఎస్కేలా వరుసగా 3 టైటిల్స్ గెలవడం భవిష్యత్తులో మరే జట్టుకు సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ చేద్దామని ప్రయత్నించినా.. చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరగడం లేదు.

వరుసగా 10 సీజన్లలో ప్లే ఆఫ్స్కు..
ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే గతేడాది మినహా ఆడిన ప్రతీ సీజన్లోనూ ప్లే ఆఫ్స్కు చేరింది. 2008 అరంగేట్ర సీజన్ నుంచి 2019 సీజన్ వరకు చెన్నై జైత్రయాత్ర అప్రతహితంగా సాగింది. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017లో బ్యాన్కు గురైంది. ఈ రెండు సీజన్లు మినహా 2019 వరకు ఆడిన ప్రతీ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. ఇందులో 2010, 2011, 2018 టైటిల్స్ గెలిచిన ధోనీ సేన.. 2008, 2012, 2013, 2015, 2019 ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. 2009లో సెమీస్కే పరిమితమైన ఆ జట్టు..2014 ప్లే ఆఫ్స్కు మాత్రమే పరిమితమైంది. అయితే ఇలా వరుసగా 10 సార్లు ప్లే ఆఫ్స్కు చేరడం ఏ జట్టుకు సాధ్యం కాకపోవచ్చు. చివరకు ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్కు కూడా సాధ్యం కాలేదు. ఒకే వేళ ఆ జట్టు 10 సార్లు ప్లే ఆఫ్స్ చేరినా.. వరుసగా సాధించడం కష్టమే.

116 రన్స్ కాపాడుకున్న టీమ్..
ధనాధన్ పరుగుల మోత మోగే ఐపీఎల్లో చెన్నై ఓసారి 116 పరుగులను కాపాడుకొని విజయాన్నందుకుంది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోలో ఓ జట్టు కాపాడుకున్న అత్యల్ప స్కోర్ ఇదే. 2009 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అలియాస్ కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ 116 పరుగులకే పరిమితమైంది. అనంతరం ధోనీ తన మ్యాజిక్ కెప్టెన్సీతో పంజాబ్ను 92 పరుగులకే పరిమితం చేసి అద్భుత విజయాన్నందించాడు. రవిచంద్రన్ అశ్విన్(2/13), ముత్తయ్య మురళీ ధరన్(2/8), సురేశ్ రైనా(2/17) స్పిన్ మాయాజాలంతో ఫలితాన్ని రాబట్టాడు. అయితే ఈ ఘనతను ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లపై ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఇది కష్టమే.

ఒకే సీజన్లో బ్రావో 32 వికెట్లు..
ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రావో 32 వికెట్లతో ఈ ఘనతను అందుకున్నాడు. అప్పటి నుంచి ఈ రికార్డు మళ్లీ చెక్కు చెదరలేదు. బ్రావోను ధోనీ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా వాడుకోవడంతో అతనికి వికెట్లు దక్కాయి. స్లో యార్కర్స్, యార్కర్లు, ఆఫ్ కట్టర్స్ వేయడంలో దిట్ట అయిన బ్రావో.. బౌలింగ్లో ఎన్నో వేరియేషన్స్ చూపిస్తాడు. దాంతోనే అతను డెత్ ఓవర్లలో వికెట్లు సాధించాడు. బ్రావో తర్వాత గత సీజన్లో రబడా 30 వికెట్ల మార్క్ అందుకున్నాడు. కానీ బ్రావోను అధిగమించలేకపోయాడు. బ్యాటింగ్కు మరింత ఫేవర్గా మారిన గేమ్లో బ్రావో రికార్డును బ్రేక్ చేయడం అంత సులువైన పనికాదు.


Click it and Unblock the Notifications
