
ఆరంభం అదరలేదు..
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మలేషియా టూర్లో భారత షట్లర్లు దారుణంగా విఫలమయ్యారు. పురుషల కేటగిరిలో ఏ ఒక్క ప్లేయర్ కూడా కనీసం రెండో రౌండ్ దాటలేకపోయాడు. ఇక మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్కే పరిమితమైంది. వరల్డ్ నెంబర్ వన్ తై జూ యింగ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ సైనా నేహ్వాల్ కూడా క్వార్టర్స్లోనే ఇంటి దారి బట్టింది. రియో ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ కరోలినా మారిన్ చేతిలో సైనా ఖంగుతిన్నది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఫస్ట్ రౌండ్లోనే ఇంటి దారి పట్టగా.. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్ సిక్కీ రెడ్డి కూడా తొలి రౌండలోనే నిష్క్రమించారు.

ఇండోనేషియా, థాయ్లాండ్లో అదే వైఫల్యం..
ఇక భారత షట్లర్ల వైఫల్యం ఇండనేషియా, థాయ్లాండ్ ఓపెన్లోనూ కొనసాగింది. ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ పురుషుల సింగిల్స్లో ఒక్క భారత ఆటగాడు కూడా ఫస్ట్ రౌండ్ దాటలేకపోయాడు. సైనా సైతం ఫస్ట్ రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. సింధు రెండో రౌండ్లో వెనుదిరిగింది. సాత్విక్, చిరాగ్ జోడీ కూడా ఫస్ట్ రౌండ్లోనే నిష్క్రమించింది. థాయ్లాండ్ మాస్టర్స్లోనూ ఇదే కథ రిపీట్ అయింది.

ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లోనూ..
ఇక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లోనూ భారత షట్లర్ల వైఫల్యం కొనసాగింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సింధు కూడా క్వార్టర్స్ ఫైనల్లోనే నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి ఒకుహరా చేతిలో సింధు ఖంగుతిన్నది. ఇక కరోనా పుణ్యమా యూఎస్ ఓపెన్, జెర్మన్ ఓపెన్, కెనాడా ఓపెన్, తైపీ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, జపాన్ ఓపెన్, డచ్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్, మలేషియా ఓపెన్, థాయ్లాండ్ ఓపెన్ రద్దయ్యాయి. ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైన భారత బ్యాడ్మింటన్ స్టార్స్.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ కోసం సమాయత్తం అవుతున్నారు.


Click it and Unblock the Notifications












