విదేశీ కోచ్లు రావడం కష్టం..
‘కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో విదేశీ కోచ్లు భారత్కు రావడం చాలా కష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఎందరో మాజీ ప్లేయర్లు మనకున్నారు. వారందరినీ కోచ్లుగా ఉపయోగించుకునేందుకు ఇదో మంచి అవకాశం'అని ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిప్రాయపడింది.
పేరేంట్స్తో టచ్లో ఉండాలి..
అంతేకాక అథ్లెట్ల తల్లిదండ్రులు, కోచ్లను సమన్వయం చేసుకుంటూ సాయ్ అధికారులు పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సింధు సూచించింది. ‘అధికారులు ప్రతీ ప్లేయర్ గురించి తెలుసుకుని తీరాలి. సాయ్ స్థానిక సెంటర్లలో పర్యటించి ప్రతీ అథ్లెట్ ప్రదర్శనపై అవగాహనకు రావాలి. అథ్లెట్ల తల్లిదండ్రులతో టచ్లో ఉండాలి. వారి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు తీసుకోవాలి. అన్నింటికంటే మించి అథ్లెట్పై నిరంతర పర్యవేక్షణ ఉండడం వల్ల ఏజ్ ఫ్రాడ్కు చాన్స్ ఉండదు'అని తెలిపింది.
గుర్తింపు దక్కడం లేదు..
చాలా సందర్భాల్లో అథ్లెట్ల తల్లిదండ్రులు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభించడం లేదని సింధు ఆవేదన వ్యక్తం చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ జర్నీలో తన పేరెంట్స్ పాత్ర చాలా ఉందని ఆమె చెప్పింది. ‘ రియో ఒలింపిక్స్కు ముందు మేం అకాడమీకి షిఫ్ట్ అయ్యాం. నన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసం అమ్మ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. నాన్న తన జాబ్కు రెండేళ్లు లీవ్ పెట్టి నాకు అండగా నిలిచారు. 2015లో అయిన గాయం నుంచి నేను కోలుకునేందుకు వాళ్లిద్దరూ చాలా సాయపడ్డారు. ఆ టైమ్లో అకాడమీలో కూర్చొని ఆడేదాన్ని. ఒలింపిక్స్కు క్వాలిఫై కావాలంటే 23 టోర్నీలు ఆడాల్సి ఉంది. నాన్న సెలవులో ఉండడంతో ప్రతిరోజు నన్ను రైల్వే గ్రౌండ్కు తీసుకెళ్లేవారు. అదే నాకు ప్లస్ అయ్యింది' అని సింధు చెప్పుకొచ్చింది. ఖేలో ఇండియా లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని కొనియాడింది.