ఇందులో భాగంగా ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు (విశిష్ట పురస్కారం) అందజేశారు. మరోవైపు సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాఫకుడు డాక్టర్ చంద్రశేఖర్, కూచిపూడి కళాకేంద్రం వ్యవస్థాపకుడు కళారత్న బాల కొండల రావు, ప్రజాకవి గోరెటి వెంకన్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆయన స్థాపించిన ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతోపాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని కొనియాడారు.
ఇక, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ రామినేని, కన్వీనర్ గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట, విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు గత 19 సంవత్సరాలుగా రామినేని పురస్కారాలను అందచేస్తున్నామని తెలిపారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎల్వీ ప్రసాద్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ జీఎన్ రావు, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, ప్రముఖ హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్లతో కూడిన ప్యానల్ ఈ అవార్డులకు ఎంపిక చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలతో పాటు ఛాముండేశ్వరినాథ్ తదితరులు హాజర్యారు.