హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాఫ్టర్స్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో ఫైనల్కు దూసుకెళ్లింది. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో రాఫ్టర్స్ 4-3తో పుణె సెవెన్ ఏసెస్పై ఉత్కంఠ విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ ఫైట్కు చేరుకుంది.
చివరి టై వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన సెమీస్లో రాఫ్టర్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. 3-3తో ఇరు జట్లు సమంగా ఉన్న దశలో చివరిదైన మిక్స్డ్ డబుల్స్లో చాంగ్ పెంగ్ సూన్- ఎవొవ్ హై వాన్ జంట 15-3,15-10తో క్రిస్ అడ్కాక్-గాబ్రియెల్ అడ్కాక్(పుణె) జోడీని ఓడించి బెంగళూరును గెలిపించింది.
తొలుత పుణె ట్రంప్గా ఎంచుకున్న పురుషుల డబుల్స్లో ఓడిన రాప్టర్స్కు పురుషుల సింగిల్స్లో నెగ్గిన లెవర్డెజ్ పాయింట్ అందించాడు. కానీ మరో సింగిల్స్లో కజుమసా(పుణె) 15-11, 15-13తో సాయిప్రణీత్కు షాకివ్వడంతో ఆ జట్టు 1-3తో వెనుకబడింది.
అయితే తమ ట్రంప్ మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్లో తైజుయింగ్ 15-12,15-12 రితుపర్ణను ఓడించి 3-3తో స్కోరు సమయం చేయగా మిక్స్డ్లోనూ రాఫ్టర్స్ నెగ్గింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో నార్త్ ఈస్ట్రన్ వారియర్స్తో బెంగళూరు తలపడనుంది.