For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

India Open 2025: ప్చ్.. సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి!

ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో సెమీ ఫైనల్ చేరి టైటిల్ ఆశలు రేకెత్తించిన సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్ చేరలేకపోయింది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ ద్వయం 18-21, 14-21 తేడాతో మలేషియా జోడీ గో స్జే ఫీ-నూర్ ఇజ్జుద్దీన్ చేతిలో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో మలేషియా జోడీ ముందు భారత్ ద్వయం తేలిపోయింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చినా.. రెండో గేమ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. దాంతో ఈ మ్యాచ్‌ను మలేషియా ద్వయం ఏకపక్షంగా గెలుచుకుంది. సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమితో ఈ టోర్నీలో భారత్ కథ ముగిసింది.

India Open 2025 Satwiksairaj and Chirag Shetty lost in semifinals

శుక్రవారమే స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైన విషయం తెలిసిందే. వివాహం అనంతరం ఈ టోర్నీలోనే బరిలోకి దిగిన సింధు అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ ఇండోనేషియా ప్లేయర్, పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ మరిస్కా తుంజుంగ్ చేతిలో ఖంగుతిన్నది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 9-21, 21-19, 17-21తో పోరాడి ఓడింది. పురుషుల క్వార్టర్స్‌లో కిరణ్ జార్జ్ 13-21, 19-21 తేడాతో యాంగ్ వెంగ్(చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

Story first published: Saturday, January 18, 2025, 21:54 [IST]
Other articles published on Jan 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+