ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీలో భారత డబుల్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు శుభారంభం చేసారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ నిర్వహించే వేదికలోనే జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ జోడీ 21-13, 24-22 తేడాతో ఆన్యి సీన్-టేయి(మలేసియా) జోడీపై విజయం సాధించింది.
రెండో రౌండ్లో మాన్వీయ్-కయ్ వుమ్ ద్వయంతో సాత్విక్-చిరాగ్ శెట్టిలు తలపడనున్నారు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ ద్వయం కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో గాయత్రి-ట్రీసా 16-21, 21-19, 21-17 తేడాతో భారత్కే చెందిన అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టోపై చెమటోడ్చి విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్లో మాత్రం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్ 15-21, 21-15, 21-3తో సునెయమా(జపాన్)పై నెగ్గగా.. ప్రియాంశు రజావత్ 8-21, 15-21 తేడాతో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్(డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు.