ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. డెన్మార్మ్కు చెందిన మాగ్నస్ జొనసెన్ను ఓడించి రెండో రౌండ్కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో లక్ష్యసేన్ 21-14, 21-14 తేడాతో మాగ్నస్ జొనాసెన్పై విజయం సాధించాడు.
తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో 8-8తో సమంగా నిలిచారు. అక్కడి నుంచి ఆధిపత్యం చెలాయించిన లక్ష్య సేన్.. వరుసగా నాలుగు పాయింట్స్ సాధించాడు. సూపర్ స్మాష్లతో పాటు నెట్ ప్లేతో ప్రత్యర్ధిని ఉక్కిరి బిక్కిరి చేశాడు.

రెండు సార్లు వరుసగా మూడేసి పాయింట్లు సాధించి తొలి గేమ్ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్లోనే ఇదే జోరును కొనసాగించిన లక్ష్యసేన్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. వరుసగా పాయింట్లు సాధించి రెండో గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు.
ఇతర సింగిల్స్ మ్యాచ్లో ప్రియాన్షు రజావత్ 19-21, 21-11, 9-21 తేడాతో చికో ఆరాద్వి వర్దొయో(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. పరుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. బుధవారమే జరిగిన తొలి రౌండ్లో సాత్విక్ జోడీ 21-18, 21-14 తేడాతో ఎహ్సాన్ మహ్మద్, హెంద్ర(ఇండోనేషియా)పై విజయం సాధించింది.
మరోవైపు మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్యాస్ట్రో-అశ్విన్ పొన్నప్ప జంట 21-13, 21-18తో హాంకాంగ్ జోడీ యుంగ్ గా తింగ్, యుంగ్ పుయ్ లామ్ జోడీపై విజయం సాధించింది.