Tap to Read ➤

ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన వివాదాలు!

విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ నుంచి దీప్తి శర్మ రనౌట్ వరకు చాలా ఘటనలు ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసాయి.
Uppala Shivaprasad

1. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్.. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు రావడం దుమారం రేపింది.

ఫేక్ ఫీల్డింగ్ గుర్తించి 5 పరుగులు పెనాల్టీ విధిస్తే తాము విజయం సాధించేవాళ్లమని బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించాడు.

దనుష్క గుణతిలకపై లైంగిక వేధింపుల కేసు.. అరెస్ట్ చేసిన ఆస్ట్రేలియా పోలీసులు

11 రోజుల పాటు జైలులో గడిపిన గుణతిలక.. బెయిల్‌తో విడుదలైనా నిషేధం విధించిన శ్రీలంక క్రికెట్ బోర్డు

దీప్తి శర్మ మన్కడింగ్ రనౌట్.. ఇంగ్లండ్ పర్యటనలో ఓ మ్యాచ్‌లో పదే పదే క్రీజును ధాటిన నాన్ స్ట్రైకర్ షార్లెట్ డీన్‌ను మన్కడ్‌ రనౌట్ చేసింది.

ఇది క్రీడాస్పూర్తికి విరుద్దమని పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు దీప్తిని విమర్శించగా.. భారత మాజీ క్రికెటర్లు తిప్పికొట్టడం దుమారం రేపింది.

విరాట్ కోహ్లీ గది వీడియో వైరల్.. టీ20 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ గదికి సంబంధించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది.

ఐపీఎల్ 2022 సీజన్‌లో రచ్చ లేపిన రాజస్థాన్ రాయల్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ నోబాల్ వివాదం

అంపైర్లు నోబాల్ ఇవ్వలేదని.. బ్యాటర్లను వెనక్కి రమ్మన్న కెప్టెన్ రిషభ్ పంత్

మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com

ఇక్కడ క్లిక్ చేయండి