
హైదరాబాద్: భారత టెన్నిస్ ఆటగాళ్లు వారి సత్తా చాటుతున్నారు. టాప్ సింగిల్స్ ఆటగాళ్లైన యుకి బాంబ్రి, రామ్కుమార్ రామ్నాథన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్లో ముందంజ వేశారు.
బుధవారం జరిగిన క్వాలిఫయర్స్ తొలిరౌండ్లో 15వ సీడ్ యుకి 1-6, 6-3, 6-4 తేడాతో బ్రాడ్లీ చూనర్(కెనడా)పై విజయం సాధించాడు. తర్వాతి మ్యాచ్లో కార్లోస్ టాబెర్నర్ (స్పెయిన్)తో యుకి తలపడనున్నాడు.
మరో మ్యాచ్లో రామ్కుమార్ 6-7(8), 7-6(3), 6-2తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో గ్లెబ్ సఖరోవ్ (ఫ్రాన్స్)తో రామ్కుమార్ పోటీపడనున్నాడు.
కానీ, ఎంతో శ్రమించిన భారత ఆటగాళ్లు సుమిత్ నాగల్, ప్రజ్నేష్ పోరాటం మాత్రం తొలిరౌండ్లోనే ముగిసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.