హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో భారత పోరు ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న జోడీ క్వార్టర్స్లో ఓటమి పాలైంది. కెనడాకు చెందిన గాబ్రియల్ దబ్రోస్కీతో జతకట్టిన బోపన్న క్వార్టర్స్లో హెన్రి కొంటినిన్(ఫిన్లాండ్)-హీదర్ వాట్సన్(బ్రిటన్) చేతిలో పరాజయం పాలైంది.
టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో హెన్రి జోడీపై 7-6, 4-6, 5-7 తేడాతో పదో సీడ్ బోపన్న జోడీ ఓటమి చవిచూసింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన పోరులో బోపన్న జోడీ పరాజయం పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.