హైదరాబాద్: వింబుల్డన్ ఛాంపియన్స్ అదరగొట్టారు. వింబుల్డన్ 2018లో మెన్స్, ఉమెన్స్ విజేతలుగా నిలిచిన ఛాంపియన్స్ నిర్వాహాకులు ఏర్పాటు చేసిన డిన్నర్ ఈవెంట్లో కలిసి డ్యాన్స్ చేశారు. వివరాల్లోకి వెళితే... ప్రతిఏటా టోర్నీ తర్వాత ఇచ్చే చాంపియన్స్ డిన్నర్లో భాగంగా మెన్స్ సింగిల్స్ విజేత నొవాక్ జోకొవిచ్, వుమెన్స్ సింగిల్స్ విజేత కెర్బర్ కలిసి డ్యాన్స్ చేశారు.
ఆటలోనే కాదు డ్యాన్స్లో కూడా తాము అభిమానులను అలరించగలం అని నిరూపించారు. దీంతో "ఛాంపియన్స్ డిన్నర్ కాస్తా... ఛాంపియన్స్ డ్యాన్స్గా మారిపోయింది" అంటూ వింబుల్డన్ తన అధికారిక ట్విట్టర్లో వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియోని అభిమానులతో పంచుకుంది.
Meanwhile, at the Champions' Dinner...
— Wimbledon (@Wimbledon) July 15, 2018
🕺💃🏼#Wimbledon pic.twitter.com/WCTWWI5DWO
వింబుల్డన్ ఫైనల్లో సెర్బియా ఆటగాడు జోకొవిచ్ దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్పై 6-2, 6-2, 7-6తో వరుస సెట్లలో గెలిచిన సంగతి తెలిసిందే. జొకొవిచ్కు ఇది నాలుగో వింబుల్డన్ టైటిల్ కాగా.. మొత్తంగా 13వ గ్రాండ్స్లామ్ కావడం విశేషం. దీంతో పురుషుల ఓవరాల్ టైటిళ్ల జాబితాలో రాయ్ ఎమర్సన్ (12)ను దాటిన జకోవిచ్ (13) నాలుగో స్థానంలో నిలిచాడు.
అతని కంటే ముందు ఫెదరర్ (20), నాదల్ (17), పీట్ సంప్రాస్ (14) ఉన్నారు. ఇక, మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్పై కెర్బర్ 6-3, 6-3తేడాతో వరుస సెట్లలో సునాయాసంగా విజయం సాధించింది. కేవలం 65 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించి 2016 వింబుల్డన్ ఫైనల్లో ఓటమికి సెరెనాపై కెర్బర్ ప్రతీకారం తీర్చుకుంది.
😍🏆 @Wimbledon 2018 pic.twitter.com/ghtv8zGTQz
— Angelique Kerber (@AngeliqueKerber) July 15, 2018