
హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో భాగంగా హైదరాబాద్ ఏసెస్ జట్టు ఆడనుంది. గురువారం ఈ జట్టు ప్రాంఛైజీని నిర్వాహకులు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్ రాజ్ హైదరాబాద్ ఏసెస్ జట్టు లోగోను ఆవిష్కరించాడు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీటీఎల్ టోర్నమెంట్లో టెన్నిస్కు మంచి రోజులు వస్తాయనే నమ్మకముందని అన్నారు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
ఈ కార్యక్రమంలో విజయ్ అమృత్ రాజ్ కుమారుడు, మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రకాష్ అమృత్ రాజ్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఏసెస్ యాజమాన్య ప్రతినిధులైన రాజేష్ రాజు, మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు డా. కె. రామరాజు పాల్గొన్నారు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
ఈ కార్యక్రమంలో విజయ్ అమృత్ రాజ్ కుమారుడు, మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రకాష్ అమృత్ రాజ్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఏసెస్ యాజమాన్య ప్రతినిధులైన రాజేష్ రాజు, మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు డా. కె. రామరాజు పాల్గొన్నారు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకూ కొనసాగే సీటీఎల్లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. ఈ నెల 17న నగరంలోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్లో జరిగే పోటీలో హైదరాబాద్ ఏసెస్, బెంగుళూరుతో తలపడనుంది. తర్వాత 18న పుణెతో పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications