Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌లో సానియా ఓటమి

Sania Mirza
భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా యుఎస్‌ ఓపెన్‌లో సింగిల్స్‌ విభాగంలో మంగళవారం తొలి రౌండ్‌లో నిష్క్రమించింది. భారత పురుషుల డబుల్స్‌ జోడీ లియాండర్‌ పేస్‌, మహేష్‌ భూపతి, భారత్‌-పాక్‌ జోడీ రోహన్‌ బొపన్న, ఖురేషి జోడీలు శుభారంభం చేశాయి. వీరు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. సానియా మాజీ డబుల్స్‌ పార్ట్‌నర్‌ 23వ సీడ్‌ షహర్‌ పీర్‌ (ఇజ్రాయెల్‌) 6-7(5), 6-3, 6-1తేడాతో మీర్జాపై గెలిచింది.

తొలి సెట్‌లో ప్రత్యర్ధికి గట్టి పోటీ ఇచ్చిన సానియా తర్వాత వెనకబడిపోయింది. ఈ మ్యాచ్‌ రెండు గంటలపాటు జరిగింది. వీరిద్దరూ ఇంతకు ముందు ఆరు సార్లు తలపడగా పీర్‌కు ఇది రెండో విజయం. తొలి సెట్‌లో పీర్‌ వేగంగా 3-1తో లీడ్‌లోకి వెళ్ళింది. ట్రైబెక్‌ ద్వారా ఈ సెట్‌ను పీర్‌ గెలుచుకుంది. సానియా ఐదు డబుల్‌ ఫాల్ట్స్‌, 19 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌ చేసింది. ఫోర్‌హ్యాండ్‌ షాట్లను పాస్‌ చేయడంలో తడపడింది.

భారత్‌కు చెందిన స్టార్‌ డబుల్స్‌ జోడీ నాలుగో సీడ్‌ లియాండర్‌ పేస్‌-మహేష్‌ భూపతి జోడీ 7-6(8), 6-4తేడాతో అలెగ్జాండర్‌ డోల్‌గొపొలవ్‌ (ఉక్రేయిన్‌), ఆల్బర్ట్‌ రమోస్‌ (స్పెయిన్‌)పై వరుస సెట్లలో గెలిచింది. ఐదో సీడ్‌ భారత్‌-పాక్‌ జోడీ రోహన్‌ బొపన్న-ఖురేషి జంట 6-1, 2-6, 6-2తేడాతో అమెరికన్‌ జంట రాబీ గినెప్రి, ర్యానే విలియమ్స్‌పై గెలిచారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+