హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో మూడు మ్యాచ్లు ఫిక్స్ అయినట్లు టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ (టీఐయూ) వెల్లడించింది. ఈ మూడు మ్యాచ్లపై తాము విచారణ జరపుతామని టీఐయూ స్పష్టంచేసింది.
వింబుల్డన్కి సంబంధించి మరింత సమాచారం
క్వాలిఫయింగ్ రౌండ్లో రెండు, మెయిన్ డ్రాలో ఒక మ్యాచ్ ఫిక్స్ అయినట్లు సమాచారం అందినట్లు టీఐయూ పేర్కొంది. అయితే ఈ మూడు మ్యాచ్లు ఏంటనేవి, ఏయే ఆటగాళ్లు ఫిక్సింగ్లో ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అంతేకాదు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు పూర్తి ఆధారాలు లేవని ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మ్యాచ్ అలెర్ట్ పాలసీ ప్రకారం ఈ మూడు మ్యాచ్ల ఫలితాలను టీఐయూ సమీక్షించనుంది. బెట్టింగ్ ప్రక్రియ కారణంగానే ఈ మూడు మ్యాచ్ల ఫలితాలు తారుమారయ్యాయని భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఈఏడాది జరిగిన వింబుల్డన్ టోర్నీలో సుమారు పది మంది ఆటగాళ్లు గాయాలు, ఇతరత్రా కారణాలతో ఆట మధ్యలోనే తప్పుకున్నారు. వీటిపై మాత్రం ఎలాంటి హెచ్చరికలు రాలేదని యూనిట్ చెప్పింది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ సమయంలోనూ ఇలాంటి హెచ్చరికలే టీఐయూకి వచ్చాయి.
వాటిపై కూడా ప్రస్తుతం విచారణ జరుగుతూనే ఉంది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్కు ముందు బజ్ ఫీడ్, బీబీసీ న్యూస్ టెన్నిస్లో మ్యాచ్ ఫిక్సింగ్లు సాధారణమయ్యాయని ఓ నివేదికలో పేర్కొన్నాయి. ముఖ్యంగా గ్లాండ్ స్లామ్ టోర్నీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఈ ఫిక్సింగ్ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి.