
టెన్నిస్ ఆటగాళ్లు కూడా భావోద్వేగాలకు గురవుతారు
'టెన్నిస్ ఆటగాళ్లు అలాంటి చోట చాలా భావోద్వేగాలకు గురవుతారు. ఆ తర్వాత వెంటనే సిన్సినాటి టోర్నీలో ఆడి టైటిల్ గెలిచాను' అని సానియా ఈ సందర్బంగా గుర్తుచేసింది. ఇక 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్లో తాను పాల్గొనే దానిపై కాస్తంత అనుమానంగానే సానియా తేల్చి చెప్పింది.

టోక్యో ఒలింపిక్స్కు శరీరం సహకరించ పోవచ్చు
అప్పటికి తన శరీరం సహకరించే స్థితిలో ఉండకపోవచ్చని, ఒకవేళ టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నా పతకం సాధించే స్థాయిలో ఆడలేక పోవచ్చని సానియా మిర్జా చెప్పింది. అయితే ప్రస్తుత సమాజంలో మహిళలకు సమానత్వం లేకుండా పోయిందని అభిప్రాయపడింది. తాను ఇన్నాళ్లు సాధించిన విజయాల గురించి కాకుండా ‘తల్లి కాబోయేది ఎప్పుడనే ప్రశ్న' ఎక్కువ సార్లు వినిపిస్తూ ఉంటుందని తెలిపింది.

గ్రాండ్స్లామ్స్ గెలవడంపై దృష్టి సారిస్తా
2016 లాగే వచ్చే సీజన్లో కూడా మరిన్ని గ్రాండ్స్లామ్స్ గెలవడంపై దృష్టి సారిస్తానని సానియా పేర్కొంది. ‘2016 నాకు అద్భుతంగా గడిచింది. ఎందుకంటే నా ఆటతీరుతో గ్రాండ్స్లామ్ సహా ఎనిమిది టైటిళ్లు గెలిచాను. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు వెళ్లాను. వచ్చే ఏడాదికి ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదు' అని సానియా చెప్పింది.

హింగిస్తో విడిపోతానని ఊహించలేదు
"మరిన్ని గ్రాండ్స్లామ్స్ గెలుస్తా అనే నమ్మకంతో ఉన్నా. ర్యాంకింగ్పై మాత్రం దృష్టి పెట్టలేదు. నిజానికి హింగిస్తో విడిపోతానని ఊహించలేదు. అది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం. ఎవరైనా గెలవాలనే కోరుకుంటారు. అది జరగనప్పుడు తప్పుకోవడమే ఉత్తమం. మేమిద్దరం విడిపోయాక ఐదింటిలో మూడు టైటిళ్లు గెలిచాను. నంబర్వన్గానే ఉన్నాను' అని సానియా పేర్కొంది.


Click it and Unblock the Notifications











