
క్వార్టర్ ఫైనల్లో 'సెర్బియా సుందరి' ఇవనోవిచ్తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు మహిళల సింగిల్స్లో ఈ ఏడాది 'వింబుల్డన్' రన్నరప్, రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్స్కా (పోలండ్), ఆరో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్స్లోనే ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) జోరు కొనసాగుతోంది. ప్రిక్వార్టర్స్లో ముర్రే 6-4, 6-4, 6-2తో 15వ సీడ్ మిలోస్ రావ్నిచ్ (కెనడా)పై గెలిచాడు. మరో మ్యాచ్లో 12వ సీడ్ మారిన్ సిలిచ్ 7-5, 6-4, 6-0తో అన్సీడెడ్ క్లిజాన్ (స్లొవేకియా)ను ఓడించాడు. టాప్ సీడ్ రోజర్ ఫెడరర్కు తన ప్రత్యర్థి మార్డీ ఫిష్ (అమెరికా) నుంచి 'వాకోవర్' లభించింది.
తెలుగు వన్ఇండియా