
శనివారం తిరిగి ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత జోడి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రెండోసెట్లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చినా బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. వచ్చిన ఎనిమిది అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇక టైబ్రేక్లోనూ ప్రత్యర్థులే ఆధిపత్యం కనబర్చారు. ఈ మ్యాచ్ గంటా 54 నిమిషాల పాటు జరిగింది. తొలిసెట్లో హోరాహోరీగా పోరాడిన పేస్-సైనా 5-5తో స్కోరు సమం చేశారు. కానీ 12వ గేమ్లో సర్వీస్ను కోల్పోయి సెట్ను చేజార్చుకున్నారు.
తెలుగు వన్ఇండియా