For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్: క్వార్టర్స్ నుండి సానియా-పేస్ జోడీ నిష్ర్కమణ

By Nageswara Rao
Sania-Paes out of Olympics after quarter-final loss
లండన్, ఆగస్టు 5: లండన్ ఒలింపిక్స్‌ నుండి సానియా మీర్జా - లియాండర్ పేస్ జోడీ నిష్ర్కమించింది. దీంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న సానియా ఆశలు గల్లంతయ్యాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా - పేస్ జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన టాప్‌ సీడ్స్‌ విక్టోరియా అజరెంకా, మ్యాక్స్‌ మిర్నీ జోడీ చేతిలో భారత జోడీ 5-7, 6-7 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది. దీనితో పాటు శుక్రవారం రెండో సెట్‌లో స్కోరు 2-3తో ఉన్న దశలో వెలుతురు లేని కారణంగా మ్యాచ్‌ను ఆపేశారు.

శనివారం తిరిగి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత జోడి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రెండోసెట్‌లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చినా బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. వచ్చిన ఎనిమిది అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇక టైబ్రేక్‌లోనూ ప్రత్యర్థులే ఆధిపత్యం కనబర్చారు. ఈ మ్యాచ్ గంటా 54 నిమిషాల పాటు జరిగింది. తొలిసెట్‌లో హోరాహోరీగా పోరాడిన పేస్-సైనా 5-5తో స్కోరు సమం చేశారు. కానీ 12వ గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+