అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎస్) అంగీకరిస్తే వీరిద్దరు మిక్స్డ్ డబుల్స్లో జత కట్టాలని అనుకుంటున్నారు. అయితే, పురుషుల డబుల్స్లో అతి తక్కువ ర్యాంక్ ఉన్న క్రీడాకారుడితో జత కట్టేందుకు ఇండియా నెంబర్ వన్ క్రీడాకారుడు లియాండర్ పేస్ అంగీకరించినందుకు మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో జత కట్టే అవకాశం ఇస్తామని ఎఐటిఎస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
వింబుల్డన్ రెండో రౌండులో మహేష్ భూపతి, సానియా మీర్జా జోజీ ఆస్ట్రేలియాకు చెందిన పాల్ హాన్లే, రష్యాకు చెందిన అల్లా కుద్ర్యవత్సేవా జోడీ చేతిలో 3-6, 1-6 స్కోరుతో ఓడిపోయింది. వీరు ఓటమి పాలైన తరుణంలోనే పురుషుల డబుల్స్లో ఆడేందుకు పేస్ కోర్టులోకి ప్రవేశిస్తున్నాడు.
ఈ ఓటమితో వింబుల్డన్లో మహేష్ భూపతి పని ముగిసినట్లే. అయితే, సానియా మీర్జాకు మాత్రం ఓ అవకాశం ఉంది. మహిళా డబుల్స్లో ఆమె, బెథానీ మాటెక్ సాండ్స్ జోడీ మూడో రౌండ్లోకి ప్రవేశించింది.