ఒలింపిక్స్ వివాదాన్ని మర్చిపోవడం తనకు కష్టంగా ఉందని.. తనను చాలా చికాకు గురిచేసిందని చెప్పారు. నా వ్యాఖ్యల వల్ల సమస్య తలెత్తలేదు. నేను, భూపతి మంచి మిత్రులం. ఈ వివాదంతో స్నేహం చెడిపోయింది' అని ఆవేదనగా అంది. తాను ఫోర్హ్యాండ్, భూపతి బ్యాక్హ్యాండ్ ఆటగాడు కావడం వల్లే అతనితో కలిసి ఆడాలని ఆసక్తి కనబర్చానని, దేశం కోసం పేస్తో ఆడటం గర్వకారణంగా భావిస్తానని సానియా తెలిపారు. ఐతే ఫలానా క్రీడాకారుడితో మాత్రమే ఆడతానని తానెప్పుడూ చెప్పలేదన్నారు. దేశం కోసం ఏ క్రీడాకారుడితోనైనా కలిసి ఆడేందుకు తాను సిద్ధమేనని చెప్పింది.
లియాండర్ పేస్ మంచి క్రీడాకారుడు. చాలా కాలంగా తనకు మిత్రుడు. అతనితో కలిసి చాలాకాలం క్రితం ఆడానన్నారు. ఒలింపిక్స్లో పేస్తో కలిసి ఆడటమంటే అదొక గౌరవం అని చెప్పింది. వింబుల్డన్ మిక్స్డ్డబుల్స్ ఫైనల్స్లో పేస్ ఆడటం శుభసూచకం. మిక్స్డ్ డబుల్స్లో తాను, మహేష్ భూపతి ఓడిపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం తాను మంచి ఫామ్లో ఉన్నట్లు సానియా పేర్కొంది. సీడబ్ల్యుజీ, ఆసియా క్రీడలు, ఆఫ్రో- ఆసియా క్రీడలతో సహా తనకు మొత్తం 12 పతకాలు లభించాయన్నారు.
జీవితంలో ఇక ఒలింపిక్ పతకం ఒక్కటే తాను సాధించాల్సి ఉంది. ఒలింపిక్స్లో ఆడే ముందు పేస్తో కలిసి ఎప్పుడు ప్రాక్టీసు చేస్తారన్న ప్రశ్నకు సానియా సమాధానమిస్తూ.. లియాండర్ను తాను ఇంకా కలువలేదని చెప్పింది. జులై 23 నాటికి తాను లండన్లో ఉంటానని తెలిపింది. ' యూఎస్లోని శాన్డిగోలో ఆడేందుకు వెళ్లనున్నాను. ఆ తర్వాత లండన్ వెళతాను. జులై 23 తర్వాత పేస్తో ప్రాక్టీసు చేస్తాను' అని సానియా చెప్పింది.
తెలుగు వన్ఇండియా