
వచ్చే ఒలింపిక్స్లో తాను మహేష్ భూపతికి లేదా రోహన్ బోపన్నకు సౌకర్యవంతమైన జతగాడినని అతను చెప్పాడు. దేశం కోసం తనతో ఆడడానికి మహేష్, బోపన్న నిరాకరిస్తే ఆ తర్వాతి ఉత్తమ క్రీడాకారుడితో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు. తాను మంచి ర్యాంకింగ్ ఉన్న క్రీడాకారుడినని, దేశానికి పతకం సాధించాలంటే తనకు సరైన జోడీ కావాలని పేస్ అన్నాడు.
పేస్కు జోడీగా మహేష్ భూపతి పేరును గతవారం ఎఐటిఎ ప్రకటించింది. అయితే, పేస్తో జత కట్టడానికి భూపతి నిరాకరించాడు. ఆ తర్వాత రోహన్ బోపన్న కూడా తిరస్కరించాడు. ప్రపంచం ఏడో నెంబర్ క్రీడాకారుడైన పేస్కు నేరుగా ప్రవేశించే అర్హత ఉంది. దాంతో తన జతగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో జత కట్టాలని పేస్ భావిస్తున్నాడు. అయితే, వైల్డ్ కార్డు ఎంట్రీ సానియాకు లభిస్తేనే అది సాధ్యమవుతుంది. వారిద్దరి జోడీ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్లో సానియాకు డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుందని పేస్ అంటున్నాడు.
మహేష్ భూపతి, రోహన్ బోపన్న తన నిర్ణయాన్ని తిరస్కరించడాన్ని ఎఐటిఎ అనుమతిస్తే చెడు సంప్రదాయం ప్రారంభమవుతుందని పేస్ అన్నాడు. మహేష్, బోపన్న తీరు భారత క్రీడలకు, ముఖ్యంగా టెన్నిస్ క్రీడకు మంచిది కాదని అతను అన్నాడు.