హైదరాబాద్: పెళ్లి కుమారుడు షోయబ్ మాలిక్ పెళ్లి కూతురు సానియా మీర్జాకు మెహర్ కింద 61 లక్షల రూపాయల మెహర్ సమర్పించుకున్నాడు. అలాగే ఓ కారును కూడా సమర్పించుకున్నాడు. సానియా, షోయబ్ ల వివాహం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో 50 మంది సన్నిహితుల మధ్య జరిగింది. నిఖానామాపై వధూవరులు సంతకాలు చేశారు. ఖాజీ మహ్మద్ నజీరుద్దీన్ హుస్సేన్ వారిద్దరికి నిఖా జరిపించారు. కాగా, నిఖానామాపై తన తండ్రి పేరును మాలిక్ ఫకీర్ హుస్సేన్ గా పేర్కొన్నాడు. వివాహం తర్వాత మధ్యాహ్నం మూడున్నర, నాలుగు గంటల ప్రాంతంలో సానియా తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిపోయారు. సానియా, షోయబ్ లు మాత్రం తాజ్ కృష్ణాలోనే ఉండిపోయారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం వధూవరులు ఇంటిలో ఉండాలి. అందువల్ల వారు రాత్రి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. షోయబ్ మాలిక్ పాస్ పోర్టును తిరిగి ఇవ్వాలని పాకిస్తాన్ భారత ప్రభుత్వాన్ని కోరింది.