లాస్ ఏంజిల్స్: ఈ ఏడాది ఆగస్టులో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహించేందుకు నిర్వాహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే యూఎస్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు ఉత్సాహాంగా ఉన్నట్లు టెన్నిస్ స్టార్, అమెరికా నల్ల కలువ సెరీనా విలియమ్స్ స్పష్టం చేశారు. ప్రేక్షకులు లేకున్నా తాను ఆడేందుకు సిద్ధమని తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి జాగ్రత్తల మధ్య యూఎస్ ఓపెన్ టోర్నీ నిర్వహించనున్నారు. కొందరు ఆటగాళ్లు ఆ టోర్నీపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సెరీనా మాత్రం ప్రేక్షకులు లేకున్నా టోర్నీ ఆడుతానన్నారు. 'న్యూయార్క్ వెళ్లి టెన్నిస్ ఆడడానికి ఉత్సాహాంగా ఉన్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా నిర్వాహాకులు ఏర్పాట్లు చేస్తుండడం మంచి విషయం. నేను ఖచ్చితంగా అభిమానులను మిస్ అవుతా. ఫాన్స్ నుండి వచ్చే మద్దతును మాటల్లో వర్ణించలేం. అదొక ప్రత్యేక అనుభూతి' అని 38 ఏళ్ల సెరెనా ఓ వీడియోలో చెప్పారు.
గత మార్చి నెల నుంచి కరోనా వైరస్ కారణంగా ఏటీపీ, డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలు రద్దయ్యాయి. కొత్త టోర్నీలు ఆగస్టు నుంచి మొదలు కానున్నాయి. చరిత్రలో తొలిసారి ఈ ఏడాది 1945 తర్వాత వింబుల్డన్ చాంపియన్షిప్ను రద్దు చేశారు. వైరస్ వ్యాపించిన తర్వాత జరగనున్న తొలి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెనే. సెరీనా మరో ట్రోఫీని గెలుచుకుంటే, గ్రాండ్స్లామ్లో 24 ట్రోఫీలు గెలిచిన మార్కరేట్ కోర్ట్తో సమానంగా నిలుస్తారు. యూఎస్ ఓపెన్ టోర్నీతో 24వ గ్రాండ్స్లామ్ను సొంతం చేసుకోవాలని సెరీనా చూస్తున్నారు.
వైరస్ భయం ఉన్నా యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ప్రేక్షకులు లేకుండగానే ఆ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కుమో ఇటీవల తెలిపారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. ప్లేయర్లు, స్టాఫ్ను నిత్యం రక్షించుకునేందుకు యూఎస్ టెన్నిస్ సంఘం అత్యున్నత స్థాయి జాగ్రత్తలు తీసుకోనుందట.
టెస్టింగ్, క్లీనింగ్, ఎక్స్ట్రా లాకర్ రూమ్ లాంటి సదుపాయాలు యూఎస్ టెన్నిస్ సంఘం ఏర్పాటు చేయనుంది. న్యూయార్కోలోని క్వీన్స్లో ఉన్న బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్లో ప్రతి ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ జరుగుతుంది. అక్కడ మొత్తం 12 కోర్టులు ఉన్నాయి. ఏప్రిల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదు అయిన సమయంలో ఈ స్టేడియాన్ని తాత్కాలిక హాస్పిటల్గా వాడారు. ఇప్పుడు మ్యాచ్ల కోసం సిద్ధం చేయనున్నారు.
భారత్లో రికీ పాంటింగ్ చేతకానివాడు: గంభీర్