హైదరాబాద్: అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ అభిమానులకు శుభవార్త. ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఈ వరల్డ్ మాజీ నెంబర్ వన్ మళ్లీ కోర్టులో ఆడుగుపెట్టనుంది. డిసెంబరు 30న అబుదాబిలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో సెరెనా విలియమ్స్ ఆడనుంది.
శనివారం దుబాయిలో జరిగే ఈ మ్యాచ్లో ఆమె ప్రెంచ్ ఓపెన్ విజేత జెలెనా ఓస్టాపెంకోతో తలపడనుంది. ఈ మేరకు ముబదాలా వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ టోర్నమెంట్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్ ఆ తర్వాత 11 నెలలు ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలుచుకున్న సెరెనా, ఆ తర్వాత ఏ టోర్నీలో ఆడలేదు. వచ్చే నెల ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలో దిగాలని సెరెనా భావిస్తోంది. ఈ టోర్నీలో గనుక సెరెనా విజయం సాధిస్తే, మార్గరెట్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డు (24)ను ఆమె సమం చేస్తుంది.
For the first time in the history of #MWTC, we’re bringing you two of the world’s best female players! #MWTC10 will see 23-time Grand Slam champion @serenawilliams making her comeback against the 2017 #rolandgarros Champion Jelena Ostapenko, as they play each other on Day 3! pic.twitter.com/S3uWvxkpa5
— MWTC (@MubadalaTennis) December 24, 2017
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.