న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్స్‌కు శుభవార్త: మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్న సెరెనా

By Nageshwara Rao
 Serena Williams to return at Mubadala World Tennis Championship

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ అభిమానులకు శుభవార్త. ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఈ వరల్డ్ మాజీ నెంబర్ వన్ మళ్లీ కోర్టులో ఆడుగుపెట్టనుంది. డిసెంబరు 30న అబుదాబిలో జరిగే ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ ఆడనుంది.

శనివారం దుబాయిలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆమె ప్రెంచ్ ఓపెన్ విజేత జెలెనా ఓస్టాపెంకోతో తలపడనుంది. ఈ మేరకు ముబదాలా వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ టోర్నమెంట్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్ ఆ తర్వాత 11 నెలలు ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలుచుకున్న సెరెనా, ఆ తర్వాత ఏ టోర్నీలో ఆడలేదు. వచ్చే నెల ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలో దిగాలని సెరెనా భావిస్తోంది. ఈ టోర్నీలో గనుక సెరెనా విజయం సాధిస్తే, మార్గరెట్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డు (24)ను ఆమె సమం చేస్తుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 25, 2017, 9:54 [IST]
Other articles published on Dec 25, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X