న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెరెనా విలియ‌మ్స్‌ కొత్త పార్ట్న‌ర్ ఎవరో తెలుసా?!!

Serena Williams has found a new doubles partner in her daughter Olympia

న్యూయార్క్‌: అమెరికా దిగ్గజ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియ‌మ్స్‌కు కొత్త పార్ట్న‌ర్ దొరికింది. పార్ట్న‌ర్ అంటే సెరెనా మరో పెళ్లి చేసుకుంటుందనో, డేటింగ్ చేస్తుందనో అనుకుంటే మీరు పొరబడినట్టే. టెన్నిస్ కోర్టులో ప్రాక్టీస్ చేసేందుకు ఆమెకు పార్ట్న‌ర్ దొరికింది. ఆమె ఎవ‌రో కాదు.. సెరెనా ముద్దుల కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహ‌నియ‌న్ జూనియ‌ర్‌. చిన్నారి ఒలంపియా టెన్నిస్ కోర్టులో రాకెట్ ‌పట్టుకుని సెరెనాతో కలిసి సంద‌డి చేసింది.

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో సత్తా చాటేందుకు సెరెనా విలియమ్స్ సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రాక్టీస్‌ నిమిత్తం ఆమె తన ఇంట్లోనే నూతన టెన్నిస్‌ కోర్టును ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు యూఎస్‌ ఓపెన్‌ డెకో టర్ఫ్‌ కోర్టుపై జరుగగా.. ఈసారి లేకోల్డ్‌ కోర్టుపై జరుగనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోర్టు స్థితిగతులపై అనుభవం పొందేందుకు స్వయంగా లేకోల్డ్‌ టెన్నిస్‌ కోర్టును ఏర్పాటు చేసుకున్న సెరెనా.. ప్రాక్టీస్‌ చేస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవ‌ల సెరెనా త‌న కూతురు ఒలంపియాతో క‌లిసి ప్రాక్టీస్ చేసింది. ఇద్ద‌రూ ప‌ర్పుల్ క‌ల‌ర్ దుస్తుల్లో అట్రాక్ట్ చేశారు. డ‌బుల్స్ పార్ట్న‌ర్ త‌ర‌హాలో తల్లీకూతుళ్లు ఆడారు. ఒలింపియా త‌న రాకెట్‌తో కొన్ని షాట్లు కూడా కొట్టింది. అచ్చం అమ్మలాగే నిలబడి షాట్లు ఆడింది. కాసేపు స‌ర‌ద‌గా టెన్నిస్ ఆడిన ఒలంపియా ఆ త‌ర్వాత త‌న రాకెట్‌ను కోర్టులోనే వ‌దిలేసి వెళ్లింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సెరెనా ఈ ఫోటోల‌ను పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి. 2018, 2019 యూఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన విలియమ్స్‌ ఈ సీజన్‌లో విజేతగా నిలిచి 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు పట్టుదలతో ఉంది.

ప్ర‌స్తుతం క‌రోనా వల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా టెన్నిస్ టోర్నీల‌కు బ్రేక్ ప‌డింది. అయితే ఆగ‌స్టు నుంచి మ‌ళ్లీ టెన్నిస్ మ్యాచ్‌లు షూరు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఎస్ ఓపెన్ జరగనుంది. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి న్యూయార్క్‌లో జ‌రిగే యూఎస్ ఓపెన్‌లో పాల్గోనున్న‌ట్లు సెరీనా ఇటీవ‌ల ఓ వీడియో సందేశం ద్వారా తెలియ‌జేసింది. అయితే కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకముందే.. టోర్నీ నిర్వహిస్తుండటంపై టాప్ ప్లేయర్లు జొకోవిచ్, రఫెల్ నడాల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ధోనీని ఎందుకు మిస్ అవుతున్నాడో అసలు కారణం చెప్పిన కుల్‌దీప్‌!!ధోనీని ఎందుకు మిస్ అవుతున్నాడో అసలు కారణం చెప్పిన కుల్‌దీప్‌!!

View this post on Instagram

Caption this (MUST SWIPE RIGHT)

A post shared by Serena Williams (@serenawilliams) on

Story first published: Saturday, July 4, 2020, 17:20 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X