ఒసాకా: జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి చేరుకుని హైదరాబాద్ టెన్నిస్ సంచలనం మరో రికార్డు సాధించింది. జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. వరుస సెట్లలో ఆమె ఉక్రెయిన్ కు చెందిన విక్టోరియా కుటుజోవాన్ ఓడించింది. విక్టోరియాపై సానియా 6-4, 6-3 స్కోరుతో విజయం సాధించింది. సానియా మహేష్ భూపతితో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకుంది.