హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్పై పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కేసు నమోదు చేశాడు. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం... నాలుగేళ్ల క్రితం ఓ క్రికెట్ టోర్నీ ఆడేందుకు షోయబ్ మాలిక్ భార్య సానియా మిర్జాతో కలిసి బంగ్లాదేశ్కు వెళ్లాడు.
అయితే, ఈ పర్యటనలో షోయబ్ మాలిక్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీ జరుగుతున్న సమయంలో షబ్బీర్ రెహ్మాన్ సానియా మీర్జాను టీజ్ చేశాడని షోయబ్ మాలిక్ తెలిపాడు. తన భార్యను టీజ్ చేసినందుకు షబ్బీర్పై చర్యలు తీసుకోవాలని ఢాకా మెట్రోపోలిస్ క్రికెట్ కమిటీ చైర్మన్కు షోయబ్ మాలిక్ ఫిర్యాదు చేశాడు.
షోయబ్ మాలిక్ ఫిర్యాదుని సీరియస్గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షబ్బీర్ రెహ్మాన్పై వేటు వేసింది. సెప్టెంబర్ 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగే ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెహ్మాన్ చోటు దక్కలేదు. గత కొంతకాలంగా బంగ్లా తరుపున అన్ని ఫార్మాట్లలో షబ్బీర్ రెహ్మాన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.
అయితే, షబ్బీర్ రెహ్మాన్ వివాదాలకు కొత్తేమీ కాదు. 2017లో నేషనల్ క్రికెట్ లీగ్లో భాగంగా ఓ ఫస్ట్-క్లాస్ మ్యాచ్ సందర్భంగా అభిమానులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.