For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

No.1 ర్యాంకులో: వారి ఓటమి వల్లే, సానియా హ్యాపీ

By Nageshwara Rao

న్యూఢిల్లీ: సింగపూర్‌లో జరిగిన డబ్యూటీఏ ఫైనల్స్‌లో ఓటమి పాలైనప్పటికీ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన నెంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఏటీపీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మహిళల డబుల్స్‌లో విభాగంలో సానియా తన నెంబర్ వన్ ర్యాంకుని పదిలంగానే ఉంచుకుంది.

డబ్యూటీఏ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడి శనివారం జరిగిన సెమీస్‌లో పరాజయం పాలైంది. దీంతో మహిళల డబుల్స్ విభాగంలో వరుసగా రెండో ఏడాది కూడా నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన క్రీడాకారిణిగా సానియా మిర్జా గుర్తింపు పొందారు. మ్యాచ్ అనంతరం ర్యాంకుపై సానియా స్పందించింది.

దోస్తీ కట్టారు, సత్తా చాటారు: సెమీస్‌లోకి సాన్‌టీనా జోడి

వరుసగా రెండో ఏడాది కూడా నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం పట్ల సానియా మిర్జా ఆనందం వ్యక్తం చేసింది. 'చాలా సంతోషంగా ఉంది. రెండో ఏడాది కూడా నెంబర్ వన్‌గా నిలిచాను. ఇది నాకొక అద్భుతమైన ప్రయాణంగా భావిస్తున్నా' అని సానియా తెలిపింది.

Sania Mirza retains World No. 1 status for second successive year

నిజానికి డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీ‌లో భాగంగా శనివారం జరిగిన సెమీస్‌లో సానియా జోడి ఓటమి పాలైంది. దాంతో సానియా మిర్జా నెంబర్ వన్ ర్యాంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందరూ భావించారు.

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో సెమీస్‌లో సానియా మిర్జా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీ డబ్యూటీఏ ఫైనల్స్‌లో విజేతగా నిలిచారు. ఈ గెలుపే సానియా ర్యాంకుని దిగజారిపోకుండా కాపాడింది. ఒకవేళ బెథానీ-సఫరోవా జోడి గెలిచి ఉండి ఉంటే సానియా తన ర్యాంకును కోల్పోయి ఉండేది.

ఇంతక ముందు వరుసగా తాను 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగడంపై ట్విట్టర్‌లో సానియా మిర్జా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా సానియా మిర్జా నిలిచింది.

వరుసగా రెండో ఏడాది కూడా నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం పట్ల సానియా మిర్జా ఆనందం వ్యక్తం చేసింది. 'చాలా సంతోషంగా ఉంది. రెండో ఏడాది కూడా నెంబర్ వన్‌గా నిలిచాను. ఇది నాకొక అద్భుతమైన ప్రయాణంగా భావిస్తున్నా' అని సానియా తెలిపింది.

నిజానికి డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీ‌లో భాగంగా శనివారం జరిగిన సెమీస్‌లో సానియా జోడి ఓటమి పాలైంది. దాంతో సానియా మిర్జా నెంబర్ వన్ ర్యాంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందరూ భావించారు.

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో సెమీస్‌లో సానియా మిర్జా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీ డబ్యూటీఏ ఫైనల్స్‌లో విజేతగా నిలిచారు. ఈ గెలుపే సానియా ర్యాంకుని దిగజారిపోకుండా కాపాడింది. ఒకవేళ బెథానీ-సఫరోవా జోడి గెలిచి ఉండి ఉంటే సానియా తన ర్యాంకును కోల్పోయి ఉండేది.

ఇదిలా ఉంటే భారత ఆటగాడు ప్రగ్నేశ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. పుణె ఛాలెంజర్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రగ్నేశ్‌ ఏకంగా 59స్థానాలు ఎగబాకి 287వ స్థానంలో నిలిచాడు. మరో క్రీడాకారుడు సాకేత్‌ మైనేని టాప్‌ 200లో చోటు దక్కించుకున్నాడు.

ఇంతక ముందు వరుసగా తాను 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగడంపై ట్విట్టర్‌లో సానియా మిర్జా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా సానియా మిర్జా నిలిచింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+