
సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్ అభినందన
ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్స్లో టాప్ సీడ్ సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడీ 6-3, 6-4 తేడాతో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్టేలియా) - యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జోడీని ఓడించింది. యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడీకి 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది.

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్ అభినందన
70 నిమిషాల పాటు జరిగిన ఫైనల్స్లో సానియా మిర్జా జోడీ మంచి ప్రదర్శనను కనబర్చింది. తొలిసెట్ నాలుగో గేమ్లో బ్రేక్ సాధించిన ఇండో-స్విస్ ద్వయం 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ మరుసటి గేమ్ను సానియా కోల్పోయింది. కానీ, ఆరో గేమ్లో మరో బ్రేక్ సాధించి ఆధిక్యాన్ని 4-2కి పెంచుకుంది.

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్ అభినందన
అదే జోరులో 6-3తో తొలిసెట్ను సొంతం చేసుకుంది. ఇక రెండోసెట్ను కూడా సానియా-హింగిస్ జోడీ దూకుడుగానే ఆరంభించింది. తొలిగేమ్ను బ్రేక్ చేసి టైటిల్ దిశగా వడివడిగా సాగుతూ ఆరు గేమ్లు ముగిసేసరికి 4-2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక కీలకమైన ఏడో గేమ్లో అద్భుతమైన రిటర్న్ షాట్లతో అలరించిన సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి 5-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్ అభినందన
ఆ తర్వాత చాంపియన్షిప్ కోసం హింగిస్ సర్వీస్ చేసింది. కానీ, ఆ గేమ్ను కోల్పోయింది. అయితే తర్వాతి గేమ్లో సర్వీస్ నిలబెట్టుకోవడంలో విఫలమైన డెలెకా-ష్వెదోవా ద్వయం మ్యాచ్తోపాటు చాంపియన్షిప్ను కూడా సమర్పించుకుంది.


Click it and Unblock the Notifications











