దోహా: సానియా మిర్జా, మార్టినా హింగిస్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ప్రపంచ టెన్నిస్లో మహిళల డబుల్స్లో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా సానియా మిర్జా, మార్టినా హింగిస్ల జోడీ విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విజయానికి ఖతార్లో అడ్డుకట్ట పడింది. వరుసగా 41 మ్యాచ్లు గెలిచిన సానియా, మార్టినా జోడీ ఖతార్ ఓపెన్లో అన్సీడెడ్ రష్యన్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. ఆల్టైం రికార్డుకు కేవలం 3 మ్యాచ్ల దూరంలో ఉన్న ఈ జంట దోహాలో జరుగుతున్న ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో తడబడింది.
గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో రష్యన్ జోడీ ఎలెనా వెస్నినా, దారియా కసక్తినా జోడీ చేతిలో 2-6, 6-4, 10-5 తేడాతో సానియా, మార్టినాలు ఓడిపోయారు. గతేడాది ఆగస్టులో సిన్సినాటి టోర్నీలో ఓటమి పాలైన తర్వాత సానియా-మార్టినా జోడీ వెనుదిరిగి చూడలేదు.

ఆ తర్వాత ప్రపంచ టెన్నిస్లోనే అత్యుత్తమ జోడీగా టెన్నిస్లో మహిళల డబుల్స్ విభాగంలో నెంబర్ ర్యాంక్లో కొనసాగుతున్నారు. అంతేకాదు ఆ తర్వాత జరిగిన మ్యాచ్ మూడు వరుస గ్రాండ్ స్లామ్లను, పలు దేశాలకు చెందిన టైటిళ్లను గెలిచింది.
ఖతార్లోని దోహాలో సానియా, మార్టినా జోడీ ఓటమితో 44 వరుస మ్యాచ్ల రికార్డున్న జానా నవోత్నా, హెలెనా సుకోవాల రికార్డు ఇప్పటికి పదిలంగా నిలిచింది.