ఒసాకా: డబ్ల్యుటిఎ జపాన్ ఓపెన్ టోర్నమెంట్ సింగిల్స్ లో హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పర్వం ముగిసింది. సానియా సెమీ ఫైనల్ లో నాలుగో సీడ్ ఫ్రాన్సిస్కా ష్కిలావోనే చేతిలో 2-6, 1-6 స్కోరుతో తేడాతో ఓటమి పాలైంది. సానియా షహార్ పీర్, మారియన్ బర్టోలీని ఓడించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. డబ్ల్యుటిఎ ఈవెంట్ సెమీ ఫైనల్లో ఆమె అడుగు పెట్టడం ఇదో మూడో సారి.