మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో ఆసక్తికర పోరు జరిగింది. వరుస విజయాలతో మహిళల డబుల్స్లో ప్రపంచ నంబర్ వన్ జోడిగా కొనసాగుతున్న సానియా మీర్జా - మార్టినా హింగిస్లు ఎదురెదురుగా తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్లో సానియానే పైచేయి సాధించింది.

మిక్స్డ్ డబుల్స్లో హింగిస్ జోడిని ఓడించిన సానియా జోడీ సెమీస్కు చేరుకుంది. ఏడాదిన్నర నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్న జోడి సాన్టినా. అయితే మిక్స్డ్ డబుల్స్లో తమ తమ భాగస్వాములతో కలిసి పోటీపడ్డారు.
గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జోడిపై 7-6, 6-3 వరుస సెట్లతో సానియా-డొడిజ్(క్రొయేషియా) జోడి గెలుపొంది సెమీఫైనల్కు చేరుకుంది. కాగా.. సాన్టినా జోడీ మహిళల డబుల్స్లో టైటిల్ చేరువలో ఉంది.