మెల్బోర్న్: తొలిసారిగా భారత క్రీడాకారులు గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకున్నారు. మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు మహేష్ భూపతి-సానియా మీర్జా విజయం సాధించి తొలి గ్రాండ్స్లామ్ సాధించారు. ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన నథాలీ డెంచీ-ఆండీ రామ్ల జోడీని 6-3, 6-1 తేడాతో ఓడించి భారత్కు తొలి టైటిల్ అందించారు. సానియా మీర్జాకు ఇదే మొదటి గ్రాండ్స్లామ్ టైటిల్. నిరుడు ఈ జోడీ రన్నరప్ గా నిలిచింది. మహేష్ భూపతికి మిక్స్ డ్ డబుల్స్ లో ఇది ఏడో గ్రాండ్ స్లామ్.