
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగిస్తున్నారు. శుక్రవారం పోటీల్లో భాగంగా టెన్నిస్ పురుషుల డబుల్స్లో భారత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. కజకిస్థాన్ జోడీపై రోహన్ బోపన్న, దివిజ్ శరన్ జోడీ 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
దీంతో ఆసియా గేమ్స్లో ఆరో రోజైన శుక్రవారం భారత్ రెండు స్వర్ణాలను నెగ్గింది. అంతకుముందు రోయింగ్ క్వాడ్రుపుల్ పురుషుల స్కల్స్లో భారత రోవర్లు సవర్ణ్ సింగ్, దత్తు భోకనల్, ఓమ్ ప్రకాశ్, సుఖ్మిత్సింగ్ సత్తా చాటి స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించిన బోపన్న జోడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.