బీజింగ్: బీజింగ్ ఒలింపిక్స్ టెన్నిస్ డబుల్స్ లో లియాండర్ పేస్, మహేష్ భూపతి జోడీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ఈ జోడీ బుధవారం జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్ జోడీ మార్సిలో మెలో, సా ఆండ్రేలను 6-4, 6-2 స్కోరుతో రెండో రౌండ్ లో అతి సునాయసంగా ఓడించింది. అంతకు ముందు మంగళవారంనాడు భారత జోడీ పేస్, భూపతి ఫ్రాన్స్ జోడీ గెయిల్ మోన్ఫిల్, గిల్లీస్ సైమన్ జోడీని 6-3, 6-3 స్కోరుతో గంట వ్యవధిలోనే మట్టి కరిపించింది. పేస్, భూపతిల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మైదానంలోకి దిగగానే తమ ఆటలోని నైపుణ్యాన్ని ఉమ్మడిగా ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు కలిసి ఆడింది కూడా తక్కువే.