న్యూయార్క్: యుఎస్ టెన్నిస్ ఓపెన్ డబుల్స్ పైనల్స్ లో భారత క్రీడాకారులు ఇద్దరు పోటీ పడుతున్నారు. లియాండర్ పేస్ జోడీ, మహేష్ భూపతి జోడీని ఫైనల్లో ఎదుర్కుంటోంది. దీంతో భారత్ కు టైటిల్ లభించడం ఖాయమైంది. టాప్ సీడ్స్ మైక్, బాబ్ బ్రియాన్ జోడీపై బుధవారం పేస్ జోడీ విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. మూడో సీడ్ మహేష్ భూపతి, మార్క్ నోల్స్ ఐదో సీడ్ మాక్స్ మిర్నియి, ఆండీ రామ్ జోడీపై వరుస సెట్లలో సెమీ ఫైనల్లో విజయం సాధించింది.పేస్, అతని భాగస్వామి కారా బ్లాక్ కూడా మిక్స్ డ్ డబుల్స్ లో ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నారు.