మెల్బోర్న్: భారత టెన్నిస్ జంట లియాండర్ పేస్, మహేష్ భూపతి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీ జరిగిన పోరాటంలో ఈ జంట మాక్స్ మిర్నీ (బెలారస్), డేనియల్ నెస్టర్ (కెనడా) జంటను ఓడించి భారత జోడీ పైనల్లోకి చేరుకుంది. ఈ జోడీని తొమ్మిదేళ్ల తర్వాత జోడీ కట్టిన భారత టెన్నిస్ క్రీడాకారులు 7-6, 4-6, 6-3 స్కోరుతో ఓడించింది. థర్డ్ సీడెడ్ భారత జోడీ సెంకడ్ సీడెడ్ జోడీని మొదటి సెట్ లో ఓడించారు. అయితే, రెండో సెట్ లో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత మూడో సెట్ లో హోరాహోరీ పోరాడి గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఫైనల్లో భారత జోడీ టాప్ సీడ్ అమెరికా బ్రియాన్ సోదరులతో తలపడుతారు. బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ సోదరులు ఎరిక్ బుటోరాక్, జీన్ - జులియన్ రోజర్ జోడీని సెమీ ఫైనల్లో ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టారు.