న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్గా జపాన్కు చెందిన టెన్నిస్ సంచలనం నవోమీ ఒసాకా నిలింది. దీంతో అమెరికా దిగ్గజం, నల్ల కలువ సెరీనా విలియమ్స్ను ఒసాకా వెనక్కినెట్టింది. గత పన్నెండు నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన జాబితాలో రూ.284.20 కోట్లతో (37.4 మిలియన్ డాలర్లు) ఒసాకా అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ మార్గదర్శకాలు విడుదల.. అంపైర్లకు క్యాప్ కూడా ఇవ్వద్దు!!
ఫోర్బ్స్ మ్యాగజైన్ శుక్రవారం ప్రకటించిన జాబితా (ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్)లో రూ. 284.20 కోట్లతో (37.4 మిలియన్ డాలర్లు) ఒసాక టాప్లో నిలిచింది. ఏడాదిలో ఒసాక ప్రైజ్మనీ, ఎండార్స్మెంట్ల రూపంలో సెరెనా కన్నా రూ. 10.64 కోట్లు (1.4 మిలియన్ డాలర్లు) అధికంగా సంపాదించింది. దీంతో గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తున్న సెరెనా విలియమ్స్ రెండో స్థానానికి పడిపోయింది.
22 ఏళ్ల నవోమీ ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలుపొందింది. ఇప్పటివరకు రష్యా మాజీ క్రీడాకారిణి మరియా షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె చెరిపివేసింది. షరపోవా 2015లో 29.7 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇక ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది అథ్లెట్లతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.
2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించాక ప్రపంచ టెన్నిస్ రంగంలో ఒసాకా పేరు మార్మోగింది. ఆ తర్వాత ఏడాది 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ను కూడా సాధించింది. అయితే ఆ తర్వాత ఫామ్ను కోల్పోవడంతో ఒసాకా ప్రపంచ నెం.1 ర్యాంకు నుంచి పదో ర్యాంకుకు పడిపోయింది. అయితే గత ఏడాది కాలంగా ఎంఎన్సీ కంపెనీ బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్న ఒసాక.. సంపాదనలో టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది. అయితే సంపాదనలో మాత్రం టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది.