హైదరాబాద్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ బరిలో దిగిన 50వ మాస్టర్ సిరీస్ ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రఫెల్ నాదల్ 6-0, 4-6, 6-1తో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ విజయంతో నాదల్ అత్యధికంగా 34 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇటాలియన్ ఓపెన్లో విజేతగా నిలవడం నాదల్కు ఇది తొమ్మిదోసారి. తొలి సెట్లో అయితే వరుసగా ఆరు గేమ్లు గెలిచిన నాదల్... మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడం విశేషం.
ఇక, మూడో సెట్లోనూ అద్భుతంగా ఆడిన నాదల్ రెండుసార్లు నొవాక్ సర్వీస్ బ్రేక్ చేసి 6-1తో సెట్తో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో జొకోవిచ్ 7 ఏస్లు సంధిస్తే.. నాదల్ ఒక్కటి కూడా కొట్టేలేకపోయాడు. అయితే 6 బ్రేక్ పాయింట్లను కాచుకొని అలవోకగా విజయం సాధించాడు.
ఈ విజయంతో రఫెల్ నాదల్కు 9,58,055 యూరోలు (రూ.7 కోట్ల 52 లక్షలు) ప్రైజ్మనీతో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.