హైదరాబాద్: డేవిస్కప్లో తలపడే భారత జట్టులో వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ఎంపికయ్యాడు. ఆసియా/ఓషియానా జోన్లో భాగంగా వచ్చే నెల 7నుంచి బెంగళూరు వేదికగా ఉజ్భెకిస్తాన్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు గాను సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమైంది.
ఈ సమావేశం అనంతరం లియాండర్ పేస్తో పాటు రోహాన్ బోపన్నను కూడా భారత జట్టులో ఎంపిక చేశారు. ఈ మధ్యే దుబాయ్ ఏటీపీ టోర్నీలో మత్సోవ్స్కీతో కలిసి బోపన్న రన్నరప్గా నిలిచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుత డబుల్స్ ర్యాంకింగ్స్లో లియాండర్ పేస్ 62వ ర్యాంకులో ఉంటే రోహాన్ బోపన్న 24వ ర్యాంకులో ఉన్నాడు.
దీంతో డబుల్స్లో లియాండర్ పేస్ పేస్, రోహాన్ బోపన్నల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్పై విజయంలో కీలకంగా వ్యవహరించిన సింగిల్స్ స్టార్లు రామ్కుమార్ రామనాథన్, యుకీ భాంబ్రీలు సింగిల్స్ ప్లేయర్లుగా డేవిస్ కప్లో బరిలోకి దిగనున్నారు.
మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్కు షాకిచ్చిన డెనిస్ ఇస్తోమిన్ కెప్టెన్సీలో ఉజ్బెకిస్థాన్ బరిలోకి దిగనుంది.