హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడలో మన భారత్ స్థానాన్ని మన ఆటగాళ్లు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు వరల్డ్ ర్యాంకింగ్స్లో 51వ స్థానంలో ఉన్న భారత్ రెండు పాయంట్ల ముందుకెళ్లింది. కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో 51వ స్థానంలో ఆచంట శరత్ కమల్ కొనసాగుతున్నాడు.
ఇప్పుడు కమల్ను దాటేస్తూ సత్యన్ 49వ ర్యాంకును సంపాదించాడు. అంతేకాదు గతేడాది నుంచి దూకుడు మొదలుపెట్టిన సత్యన్ బెల్జియం ఓపెన్, స్పానిస్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు.
ఇంకా ప్రపంచ స్థాయి ర్యాంకుల్లో అండర్-18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్ లోనూ మానవ ఠక్కర్ 18, మానుష్ షా 47 వ స్థానంలో, హైదరాబాద్ స్నేహిత్ 64 ర్యాంకుల్లో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.